“నేను విధవను అయితే మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకుంటాడు నన్ను విధవను చెయ్”
అసలేం జరిగింది
మెఘాలయలో జరిగిన ఓ హనీమూన్ ట్రిప్ భయానకంగా ముగిసింది (Meghalaya Honeymoon). మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన కొత్త జంట Raja Raghuvanshi 30, Sonam 25 లు వివాహానంతరం హనీమూన్ కోసం చిరపుంజికి వెళ్లారు. కానీ ఈ ప్రణయయాత్ర ఓ దారుణ హత్యకథగా మారింది.
మే 11న పెళ్లి చేసుకున్న Raja Raghuvanshi, Sonam మే 20న హనీమూన్కి వెళ్లారు. May 23న, ఇద్దరూ నాంగ్రియాట్లోని హోం స్టే నుంచి చెక్ఔట్ చేశారు. ఆ తర్వాత వారు చివరిసారిగా మౌలఖైత్ వైపు వెళ్తూ కనిపించారు. వారి రెంటల్ స్కూటర్ అదే రోజు విస్మృతమైన స్థితిలో లభ్యమైంది. కానీ వారు కనిపించలేదు.
దాదాపు పది రోజులకు పైగా గడిచిన తర్వాత, జూన్ 2న రాజా శవం చిరపుంజి సమీపంలోని వే సావ్డాంగ్ జలపాతాల కింద గుర్తు తెలియని స్థితిలో లభించింది. ఇది సహజ మరణమా? ప్రమాదమా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
జూన్ 9న సోనం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసుల ముందు లొంగిపోయింది. దర్యాప్తులో, ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో ( Raj Kushwaha) కలిసి రాజా హత్యకు కుట్ర పన్నిందని తెలుస్తోంది. తాను హనీమూన్కు వెళ్లిన భర్తను మినహాయించి, ఈ ముద్దుబోతుతో కలిసి హత్యకు ఒడిగట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. సీసీ కెమెరా ఫుటేజ్లు, ఫోన్ రికార్డులు, సాక్ష్యాల ఆధారంగా సోనం పాత్ర స్పష్టమైంది.
రాజ్ కుష్వాహా (21) సోనం కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆయనతో సోనం గత కొంతకాలంగా సంబంధం పెట్టుకుందనే ఆరోపణ ఉంది. అయితే రాజ్ కుటుంబ సభ్యులు అతడు అలా చేస్తాడని ఎప్పటికీ ఊహించలేదని అంటున్నారు.
ఈ కేసు రెండు కుటుంబాలను విషాదంలో ముంచింది. రాజా కుటుంబం నిందితులందరికీ ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది. సోనం తండ్రి మాత్రం పోలీసుల కథనాన్ని తిరస్కరించి, సీబీఐ విచారణ కోరుతున్నారు. సన్నిహిత సంబంధాల్లోనే ఇలా ద్రోహం జరగడం అందరినీ కలచివేసింది.
ఈ ఘటన విశ్వాసం, ప్రేమ మరియు ద్రోహం అనే అంశాలపై ప్రజల్లో చర్చలు రేపింది. ప్రేమ పేరు చెప్పి, ప్రాణం తీసే స్థితికి ఎలా వచ్చారన్న ప్రశ్నలు మిగిలాయి. హనీమూన్గా మొదలైన ఓ ప్రయాణం… ప్రాణాంతక మలుపు తీసుకున్న సంగతి అందరినీ దిగ్రహించచేసింది.
దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ‘మెఘాలయ హనీమూన్ మర్డర్’ కేసు నిజమైన ప్రేమ, మోసపు ప్రేమ మధ్య తేడా గుర్తించాల్సిన అవసరం ఎంత ముఖ్యమో మనమందరినీ ఆలోచింపజేస్తోంది.
మన మెదడులో ఎన్నో ప్రశ్నలు. మన సమాజం ఎటువైపు వెళుతోంది, పెళ్ళిళ్ళు ఎందుకు విఫలమౌతున్నాయి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పే ధైర్యం లేదు కాని కట్టుకున్న భర్తను చంపడానికి లేదా చంపించడానికి అంత ధైర్యం ఎలా వస్తుంది.
“నేను విధవను అయితే మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకుంటాడు నన్ను విధవను చెయ్” అని Sonam చెప్పింది. Killers ని కూడా ఈమె 50 వేల రూపాయలు ఇచ్చి నియమించింది అనే వార్తలు వస్తున్నాయి.
ఈమె చేసిన పని వలన రెండు కుటుంబాలు ఎంతో మానసిక క్షోభకు గురికావాల్సి వచ్చింది .
ఈమె సంతోషంగా ఉంటుందా అంటే? జైల్లో ఉండాలి. నేరం రుజువైతే జీవితకాలం లేదా 7 సంవత్సరాలు పైన శిక్ష పడే అవకాశం ఉంటుంది.
ఈ honeymoon case మగ వారికి పెళ్లి చేసుకోవాలంటేనే భయపడేలా చేసింది.
ఈ కధ చదివిన తర్వాత ప్రతి ఒక్కరూ చెయ్యాల్సిన పని ఏంటంటే, మీకు పెళ్లి ఇష్టం లేకపోతె మీ ఇంట్లో ధైర్యంగా చెప్పండి. సమయం తీసుకోండి, ఇంట్లో ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపొండి. ఇంట్లో వాళ్లకు భయపడి పెళ్లి చేసుకొని, కట్టుకున్న వాడిని నరకం చూపించకండి. కుదిరితే సర్దుకు పోయి సంసారం చేసుకోండి లేకపోతే మీకు ధైర్యం ఉంటె తప్పు మీదే అని ఒప్పుకొని విడాకులు తీసుకోండి. సమాజంలో మీ పైన మంచి అభిప్రాయం ఉండాలని మగవారిదే తప్పు అని చూపించి లేనిపోని నిందలు వేసి విడిపోకండి.
ప్రతి ఒక్కరూ, ఆడ వారు మాత్రమె కాదు మగ వారు కుడా అంతే పెళ్లి ఇష్టం లేకపోతె ఇరువురు కూర్చొని, మాట్లాడుకొని Mutual Divorce తీసుకొని మానశ్యాంతి తో బ్రతకండి.
లేకపోతె మీ జీవితానికి మీరే శత్రువులు గా తయారవుతారు.
సోనం ఎంత తెలివి తక్కువగా తన భర్తను చంపడానికి వ్యూహ రచన చేసిందో చూస్తే ఆమె అమాయకత్వం మరియు తన ప్రేమికుడి కోసం ఏదైనా చేసే తెగింపు కనిపిస్తాయి.
Raja Raghuvanshi మరణానికి కారణం ఎవరు?
ఇప్పటి సమాజం లో చాలా మంది భార్య బాధితులు తయారవుతున్నారు దీనికి ప్రధాన కారణం ఏమిటి?
పెళ్లి చేసే సమయం లో, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని అడగని తల్లిదండ్రులదా?
ప్రేమ గురించి వ్యక్త పరచని అమ్మాయి లదా?
సమాజం గురించి అవగాహనా లేకపోవడమా?
పెళ్లి చేసే సమయం లో, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని అడగని తల్లిదండ్రులదా?
Raja Raghuvamshi లాంటి అమాయకులు బలి అవ్వడానికి పైన తెలిపిన కారణాలు ఒక్కటే కాదు చాలా కారణాలు ఉండవచ్చు.
తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోకపోవడం, వారు ఏం చేస్తున్నారో తెలుసుకోకపోవడం ఒక కారణం. తల్లిదండ్రుల నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు.
పెళ్లి చేసే సమయం లో తల్లిదండ్రులు పిల్లలను పెళ్లి ఇష్టం ఉందా లేదా అని అడగడం మానేసారా. తల్లిదండ్రులు పిల్లలు ప్రేమ గురించి చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోలేదంటే, దానికి కారణం కోసం వెతకాలి అమ్మాయిలు.
తల్లిదండ్రులు వారి కున్న అనుభవాల ద్వారా పిల్లలను అన్ని నచ్చ జెప్పాలి కుదరకపోతే ఇలా అమాయకులైన రాజ రఘువంషి లాంటి యువకులకు ఇచ్చి పెళ్లి చేయకూడదు. ఇటువంటి తల్లిదండ్రులు చేసే తప్పుల వళ్ళ ఎంతమంది మానసిక క్షోభకు గురికావాల్సి వస్తుందో. బెంగళూరు లో జరిగిన సంఘటనలు చూశాం, ఏమైనా నేర్చుకున్నామా? ఎందుకు ఇటువంటి సంఘటనల నుంచి ఏమి నేర్చుకోలేకపోతున్నాం.
ప్రేమ గురించి వ్యక్త పరచని అమ్మాయి లదా?
మేము ఫలానా అబ్బాయిని ప్రేమించాం, వారు లేక పొతే మేము లేము అని చెప్పలేరు. వీరికి ఎందుకు ప్రేమ.
ప్రేమంటే ఏమిటి?
నిజంగా ప్రేమ ఉందా. ప్రేమంటే ప్రేమించిన వ్యక్తి పట్ల తీసుకునే భాద్యత. ప్రేమంటే కేరింగ్. ఇలా హత్యలు చేసుకుంటూ పొతే మీరు వారి పట్ల భాద్యతగా ఉన్నట్టా. తల్లిదండ్రులను ఒప్పించాలి లేదంటే పెళ్లి లేకుండా అతని కోసమే ఉండిపోవాలి.
సమాజం గురించి అవగాహనా లేకపోవడమా?
ఈ సమాజం మనకు చాలా నేర్పుతుంది. మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు ద్రోహం చేస్తున్నారు ఇవన్నీ మనకు జీవితంలో ఎదురయ్యే సంఘటనలే నేర్పిస్తాయి. కాని అప్పటికే అంతా చెయ్ జారి పోయింటుంది. ఈ సమాజాన్ని చదివే విధంగా పిల్లలను తల్లిదండ్రులు చిన్నపటి నుంచే నేర్పించాలి. లేదంటే పిల్లలు చాలా కోల్పోతారు.
ఏది ఏమైనా ఇలాంటి అమాయక Raja రఘువంశి లాంటి వారిని కాపాడు కోవాలి.
చట్టాలు ఇలాంటి ఆడ వారిని ఖటినంగా శిక్షించే విధంగా తయారు చెయ్యాలి.
ఆడ వారికి మరియు మగ వారికి సమాన మైన చట్టాలు రావాల్సిన సమయం ఇది.
Rest in Peace Raja Raghuvanshi